ఇష్టం లేని పెళ్లి చేశారని….

7నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో కలిసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నవనీత, కన్నెకల్‌కు చెందిన నరేష్‌ లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈనేపథ్యంలో నవనీతకు తన భావతో ఈనెల 3న వివాహం జరిగింది. అయితే బావతో పెళ్లి ఇష్టం లేదని కూడా తల్లిదండ్రులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు బావతోనే నవనీత వివాహం చేశారు. ఈక్రమంలో ఈనెల 7న ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేశారనే మనస్తాపంతో ప్రియుడు నరేష్‌ తో కలిసి నవనీత తిప్పర్తి మండలం మాడుగులపల్లి సమీపంలోని బత్తాయితోటలో ఆత్మహత్యకు పాల్పడింది. వీరు వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.