ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత

జమ్మికుంట, మే 12: మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో గ్రామస్తులు మూడు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. మానేరువాగు నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అయితే ఇసుక తరలింపునకు తమకు తహసీల్దార్‌ అనుమతి ఇచ్చారని ట్రాక్టర్‌ యజమానులు తెలిపారు. వెంకటేశ్వర్లుపల్లెలోని సీసీరోడ్డు పనుల కోసమే ఇసుకను తరలిస్తున్నామని చెప్పడంతో గ్రామస్తులు ట్రాక్టర్లను విడిచిపెట్టారు.