ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు

సిద్ధిపేట,అక్టోబర్‌29(జనం సాక్షి ): దుబ్బాక మండలం ఆకారం శివారులో కూడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం విూదుగా వెళ్లే కూడవెల్లి వాగులో వరద నీరు పోటెత్తింది. వాగు మధ్యలో ఉన్న బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు వెళ్తుంది. దీంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. కూడవెల్లి వాగు నుంచి వస్తోన్న వరద నీరు సిరిసిల్లా జిల్లాలోని అప్పర్‌ మానేరులో కలువనుంది. మరోవైపు పుష్కలంగా నీరు చేరి మత్తడి పోస్తున్న వాగును చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.