ఉప్పల్‌ లోనే ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఈ ఏడాది ఐపీఎల్‌ ్గ/నైల్‌ మ్యాచ్‌కు.. ఉప్పల్‌ స్టేడియం వేదిక కానున్నది. మే 12వ తేదీన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుంది.
చెన్నైలో మొదటి క్వాలిఫయర్‌, విశాఖపట్టణంలో ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకు 11 ఐపీఎల్‌ సీజన్స్‌ ముగిశాయి. ఇప్పుడు 12వ సీజన్‌ జరుగుతోంది. ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ ¬ల్డర్‌గా ఉంది. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఈ టోర్నీని మూడేసి సార్లు గెలుచుకున్నాయి.