ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ జంట

ఏలూరు,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో వివాహేతర సంబంధమున్న ఓ జంట శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల సురేష్‌, సరోజిని అనే ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోందని స్థానిక సమాచారం. బంధువుల ఇతరులకు వ్యవహారం తెలియడంతో భయంతో వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.