*ఎంపీడీవో కు రాఖీ కట్టిన లింగంపల్లి చెల్లెలు

లింగంపేట్ 12 ఆగస్టు (జనంసాక్షి)
 లింగంపేట్ మండలంలోని లింగంపల్లి కుర్దు గ్రామంలో శుక్రవారం 75 వ స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా లింగంపేట్ ఎంపీడీవో పర్బన్న,గ్రామ సర్పంచ్ బండి రాజకీయాలకు గ్రామ మహిళా సంఘాలు రాఖీలు కట్టి రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బండి రాజయ్య మాట్లాడుతు వజ్రోత్సవంలో భాగంగా గ్రామంలో అన్నలకు చెల్లెలు లేని లోటు మహిళా సంఘాలు తీర్చారాని సంతోషం వ్యక్తం చేశారు.ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో ఎంపిటిసి భాగ్య ఉపసర్పంచి రవి,కార్యదర్శి బాలు,వివేకనంద గ్రామపంచాయతీ సిబ్బంది మహిళా సంఘాలు పాల్గొన్నారు.