ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు రూ.12వేల మద్దుత ధర ఇవ్వాలని వారు డిమాండ్‌ చేసారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8400 ధరను మార్కెట్‌ అధికారులు నిర్ణయించారు. ధరలను తగ్గించి కొనుగోలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతకొంతకాలంగా ధరలు తగ్గించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.