ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు 

                                  సిఐ. బి వి ప్రసాద్
కమలాపూర్ నవంబర్ 18 (జనం సాక్షి)
ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కమలాపూర్ సి ఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు
ఆయన  మండలంలోని మాదన్నపేట గునిపర్తి శ్రీరాములపల్లి గ్రామాలలో ఆదివారం రాత్రి ఎన్నికల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మూడు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు ను వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు