ఎన్‌ఆర్‌ఐల సహకారంతో లైబ్రీరీ ఏర్పాటు

పుట్టిన ఊరికి సహకారం గొప్ప విషయం
ప్‌ఆరరంభోత్సవంలో ఎంపి కవిత
కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధికి.. ఎన్‌ఆర్‌ఐలు సహకారం అందించడం.. గొప్ప విషయమని ఎంపీ కవిత అన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి.. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నరు. కరీంనగర్‌  జిల్లా  తిమ్మాపూర్‌ మండలం నల్లగొండ గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ సంపత్‌ కృష్ణ సహకారంతో నిర్మించిన కొత్త గ్రంథాలయాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. స్థానిక జిల్లా  పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భాగంగా..  గ్రంథాలయం నిర్మించడంతో.. విద్యార్థులకు ఎంతో ప్రయోజనక
రంగా ఉంటుందని ఆమె చెప్పారు. మన ప్రాంతానికి, చదువుకున్న పాఠశాలకు, పుట్టిన ఊరుకు తమవంతుగా ఎంతో కొంత తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి యూరప్‌ అధ్యక్షుడు సంపత్‌ రావు ప్రతి ఏడాది తన స్వగ్రామానికి వీలైనంత సహాయం అందిస్తూ వస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. మంచి పుస్తకాలు విద్యార్థుల జీవితాన్ని మారుస్తాయి. పుస్తకాలు చదివే సంస్కృతి తగ్గిపోతున్న తరుణంలో మంచి పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసిన సంపత్‌ రావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కవిత చెప్పారు. ఎల్యే రసమయి బాలకిషన్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీ కవిత ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తున్న ఎన్‌ఆర్‌ఐ మిత్రులకు ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు.  గ్రంథాలయ నిర్మాణం విద్యార్థులకు.. చదువుపై ఆసక్తి  పెరుగుతుందని.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మేయర్‌ రవీందర్‌సింగ్‌, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.