ఎపిలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా మరో 1167 కరోనా కేసులు నమోదు
అమరావతి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో కరోనా కేసులు శనివారం స్వల్పంగా తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,45, 657 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 07 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 125 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13, 208 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1487 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 20,18, 324 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 55, 307 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 80, 36, 099 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.