ఎపి ప్రయోజనాలు కెసిఆర్ కాళ్ల వద్ద జగన్ తాకట్టు: బుద్దా
విజయవాడ,మార్చి26(జనంసాక్షి): ఎట్టకేలకు జగన్ రాజకీయ ముసుగు తీసేసారని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో తనకు సంబంధాలు ఉన్నాయన్న జగన్ ఒప్పుకున్నారని ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో కేసీఆర్కు లొంగిపోయి, ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న జగన్ని చూసి తాము కూడా సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎందుకంటే, ఈ రాష్ట్రంపై తమకు ఉన్న మమకారాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర జగన్ తాకట్టుపెట్టారని అందుకే, తాము కూడా సిగ్గుపడుతున్నామని చెప్పారు.విజయవాడలో మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ, ‘నాకు వెయ్యికోట్లు ఇచ్చినట్టు చంద్రబాబుకు కేసీఆర్ ఏమన్నా చెప్పారా? నేను ఏమన్నా చెప్పానా?’ అంటూ దీర్ఘాలు తీసుకుంటూ జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రూ.43 వేల కోట్లు ప్రజాధానాన్ని దోచుకున్నప్పుడు ఎవరికైనా జగన్ ఫోన్ చేసి చెప్పారా? అని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా దొంగతనాలని,… దొంగతనాలు చేసే వాళ్లెవరూ బయటకు చెప్పరని విమర్శించారు. అఫిడవిట్ లో జగన్ ఆస్తులు కూడా తప్పుడు లెక్కలేనని, ఏ వ్యాపారాలు చేసి ఆయన అంత ఆస్తి సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘విూ ‘సాక్షి’ టీవీ, పేపరు కూడా లాస్లోనే ఉన్నాయి కదా?’ అని ప్రశ్నించారు.