ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరం:తమ్మినేని

మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరంగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది పాలనలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. మిషన్ కాకతీయ పనులు నిజాయితీగా జరిగితే ఆహ్వానిస్తామని చెప్పారు. 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్క కుటుంబాన్నీ మంత్రులు పరామర్శించలేదని తెలిపారు. ఓయూ విద్యార్థుల పోరాటం న్యాయమైందని పేర్కొన్నారు. ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకుని.. పేదలకు పంచాలని సూచించారు. లేదంటే వామపక్షాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం… ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.