ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకు ర్యాలీ

విజయవాడ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ర్యాలీతో విజయవాడ నగరం ఉదయం యువకులతో నిండిపోయింది. విజయవాడ నగరంలో తొలిసారి వాయుసేన నియామకాల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం శనివారం ప్రారంభించారు. విజయవాడలోని దండమూరి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్‌ స్టేడియం, బందర్‌రోడ్డులో నియామకాలు జరుగుతున్నాయి. 17-21 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు ఈ నియామకాల్లో పాల్గొనేందుకు అర్హులు. శనివారం ర్యాలీలో విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి సుమారు 3,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వీరంతా ఉద్యోగాల్లో తమ శరీర ధారుడ్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.