ఎల్‌కే అద్వానీకి మోదీ జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,నవంబర్‌8 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయ ప్రకాశ్‌ నడ్డా స్వయంగా ఎల్‌కే అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎల్‌కే అద్వానీకి పార్టీ సీనియర్లు, ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.