ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధి ఖర్చుకు ప్రత్యేక చర్యలు

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధి చట్టం-2017ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ గతంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన నిధుల కన్నా ఈ చట్టం ద్వారా రెట్టింపు నిధులను ఖర్చు చేసే అవకాశం దక్కిందన్నారు. సీనియర్‌ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ దళిత గిరిజన, ఇతర వర్గాల మధ్య ఆర్థిక సామాజిక అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌ చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్యయ్య, ఇతర రాషా్ట్రల ప్రతినిధులు పాల్గొన్నారు.