ఏసీబీ వలలో సస్పెండ్ అయిన తహసీల్దార్

నల్గొండ:లంచం తీసుకుంటూ సస్పెండైన యాదగిరిగుట్ట తహశీల్దార్ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. ఓ రైతు వద్ద నుంచి రూ. 15 వేలను లంచంగా తీసుకుంటూ తహశీల్దార్ సోమ్లానాయక్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. భూముల రిజిస్ట్రేషన్ అవకతవకలతో సోమ్లానాయక్ గతంలో సస్పెండైయ్యాడు.