ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, ఏప్రిల్ 19( జనం సాక్షి): ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని  హైదరాబాద్ లోని ప్రగతి భవన్  హెచ్ఎండిఎ కార్యాలయంలో  ఇల్లందు నియోజకవర్గ  ఎమ్మెల్యే  హరిప్రియ హరిసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా మంగళవారం రాత్రి కలిసారు. కేటీఆర్ తో ఇల్లందు నియోజకవర్గంలోని పలు సమస్యల పట్ల, జరగవలసిన అభివృద్ధి పనుల గురించి దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లందు నియోజకవర్గం  కోల్ బెల్ట్ ప్రాంతం కావడంతో  కోల్ బెల్ట్ ఏరియా సమస్యల గురించి మంత్రికి వివరించారు. ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు మున్సిపాలిటీలో, ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే హరిప్రియ అభ్యర్థనను  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఇల్లందు ప్రాంతంలో ఎమ్మెల్యే సూచించిన పలు అభివృద్ధి పనులకునిధులు కేటాయించడం జరుగుతుందని, వెంటనే ఎస్టిమేట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ ని కలిసిన వారిలోఎమ్మెల్యే  వెంట ఇల్లందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇల్లందు ఉపాధ్యక్షులు ఎస్ రంగనాథ్, ఇల్లందు మండల  జడ్పిటిసి ఉమాదేవి ,ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి ,ఇల్లందు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బర్మవత్  లాల్ సింగ్ , టేకులపల్లి మండల ఉపాధ్యక్షుడు  చీమల సత్యనారాయణ, సీనియర్ నాయకులు కళ్ళెం కోటి రెడ్డి ఉన్నారు.