ఒంటరి బాలికపై దుండగుల దాడి

మోసంతో లాడ్జికి తీసుకొని వెళ్లి అత్యాచారం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్లిన బాలిక ఒంటరిదని గుర్తించిన ఇద్దరు అత్యాచారనికి ఒడిగట్టారు. ఈ 15 బాలికపై పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వాస్తవానికి ఆ బాలిక ఢిల్లీకి వెళ్లాల్సింది. అయితే పొరపాటున అమృత్‌సర్‌ చేరుకుంది. అక్కడి నుంచి దారి కనుక్కొని ఢిల్లీకి వెళ్దామని అనుకునేలోపే ఈ దారుణం జరిగింది. ¬టల్‌ గదిలో బాలికపై అత్యాచారం చేసిన తర్వాత విషయం బయటికి చెప్పొద్దంటూ చావబాదారు. అనంతరం బాలికను లుధియానా బస్సెక్కించి వెళ్లిపోయారు. అయితే యువతి లుధియానా చేరుకోగానే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న లుధియానా డివిజన్‌ 4 పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితులను అమృత్‌సర్‌కు చెందిన సాహిబ్‌ సింగ్‌, బాబాలుగా గుర్తించారు. ఇక బాలిక ప్రేమ విషయంలోకి వెళితే.. ఏడాది క్రితం లుధియానాలో తమ బంధువుల వద్దకు బాలిక ఓసారి వచ్చినప్పుడు సాహిల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి దారి తీసింది. బాలికను ఫిబ్రవరి 3న సాహిల్‌ ఢిల్లీకి రమ్మని, అక్కడే పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అనంతరం ఇంట్లో నుంచి 1,500 రూపాయలుదొంగిలించి ఢిల్లీకి బయలుదేరిన బాలిక దారి తప్పి అమృత్‌సర్‌ చేరుకుంది.
అమృత్‌సర్‌ చేరుకున్న బాలికను సాహిబ్‌ సింగ్‌ అనే ఆటో డ్రైవర్‌ బోల్తా కొట్టించాడు. ఉదయం ఢిల్లీకి ట్రైన్‌ ఉందని, అప్పటి వరకు ¬టల్‌లో ఉండమని చెప్పాడు. ¬టల్‌లో దిగిన బాలికపై తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. అనంతరం విషయం బయటికి చెప్పవద్దని బాలికను చితక్కొట్టి లుధియానాకు బస్సెక్కించాడు.