ఒడిశాలో భారీ వర్షాలు

కటక్‌,జూలై21(జ‌నం సాక్షి): ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా ఏకంగా భువనేశ్వర్‌-జగదల్‌ పూర్‌ ట్రైన్‌ నీటిలో చిక్కుకుపోయింది. రాయగఢ్‌ జిల్లాలోని పట్టాలపై భారీగా నీరు చేరటంతో రైలు ముందుకు కదలలేకపోయింది. దీంతో పట్టాలపైన ఆపేశారు. పెద్ద ఎత్తున వరద నీరు పట్టాల గుండా ప్రవహిస్తోంది. దీంతో రైళ్లో ఉన్నవారిని సురక్షితంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.