ఒడిషాలో వరదల బీభత్సం

258ఒడిషా;

ఒడిషాలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. వరదల తాకిడికి 350 జిల్లాల్లోని ఐదు లక్షల మంది ప్రజలు గ్రామాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎగువ ప్రాంతాలకు తరలిపోతున్నారు. బాలాసోర్‌, బద్రక్‌ ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒడిషాలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మహానది, వైతరణితోపాటు అనేక నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.