ఓటమిపై జూపల్లి కామెంట్స్…

మహబూబ్‌నగర్: జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు. ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై దాదాపు 3వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ… మా నేతలే మాకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు. ఇక రెస్ట్ తీసుకుంటానంటూ జూపల్లి వ్యాఖ్యానించారు. ఓడిపోవడం పట్ల నాకు బాధలేదన్నారు. టీఆర్ఎస్ నేతలే నన్ను ఓడించారని కృష్ణారావు పేర్కొన్నారు.