ఓడితే రాజకీయ సన్యాయం తీసుకుంటా – తలసాని..

హైదరాబాద్ : సనత్ నగర్ కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే ఓడితే రాజకీయ సన్యాయం తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. పార్టీ టికెట్ పై గెలిచిన టీఆర్ఎస్ లో చేరిన నేతలు, శాసనసభత్వానికి రాజీనామా చేయాలని టి.టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తలసాని స్పందించారు. నోటి మాటతో కాకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుందామని తలసాని సవాల్ విసిరారు.