ఓ బి సి నూతన నియామకాలు ఓ బి సి నూతన నియామకాలు 

 

 

 

 

 

హత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ బలోపేతం కృషి చేస్తా ఓ బి సి జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్…..
భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):—పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓబిసి ముఖ్య నేతల సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం  కోసం  నూతనంగా  ఎం.రమేష్ పోచంపల్లి మండల చైర్మన్ , ఎన్.రమేష్ అడ్డగూడుర్   మండల చైర్మన్ , సతీష్ ఆలేరు టౌన్ ప్రెసిడెంట్ , కే.శ్రీనివాస్ మోత్కూరు మండల చైర్మన్ , కే.రాజశేఖర్ జిల్లా కార్యదర్శి , నిమ్మల సాయి గౌడ్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ , గోద శివ గౌడ్ జాయింట్ కో ఆర్డినేటర్ ,  సుభాష్ జిల్లా కో ఆర్డినేటర్ , బిబినగర్ మండల ఉపాధ్యక్షులు గా  నియమించడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 6 నుండి జరగబోయే హాత్ సే హాత్  జూడో యాత్ర  కార్యక్రమంలో ఓబీసీ నాయకులు అందరూ రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎండకట్టి వారిని గద్ద దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంచి జరిగిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని తల్లి సోనియా గాంధీ తెలంగాణని ఇస్తే మన నీళ్లు నిధులు నియామకాలు విద్యా వైద్యం ఉద్యోగం ఏది సరిగా లేకపోవడం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యని ఎత్తిచూపుతు ప్రజల్లోకి వెళ్లి వారికి చెప్పి రానున్న ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ని  గెలిపిస్తే ప్రతి పేదవాడు బడుగు బలహీన వర్గాలు అందరు సంతోషంగా జీవించవచ్చని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది . ప్రతి ఓబీసీ నాయకుడు ఒక సైనికుడిలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని వారి వారి గ్రామాల్లో మరియు వారి మండలాల్లో మరియు నియోజకవర్గాలలో ఓబీసీ నాయకుల పాత్ర తప్పకుండా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.