ఔటర్‌పై ప్రమాదంలో ఒకరు మృతి

రంగారెడ్డి,జూన్‌30(జ‌నం సాక్షి): ఔటర్‌ మరోమారు ప్రమాదానికి గురయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.