ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళన
హైదరాబాద్,సెప్టెంబర్6(జనంసాక్షి): తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. భారీగా తరలివచ్చిన ఉద్యోగులు ప్రగతిభవన్ ఎదుట రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఆందోళనతో బేగంపేటలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయని అనుకున్నామని… కానీ చాలీచాలని జీతాలతో ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.