కంటి వెలుగు సద్వినియోగపరుచుకోవాలి

జనం సాక్షి , మంథని : కంటి వెలుగు ను సద్వినియోగ పరుచుకోవాలని దుబ్బ పల్లె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు సూచించారు. శుక్రవారం మంథని మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎర్రవెల్లి నరేష్ రావు కంటి వెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేసుకొని అవసరమైన వారు మాత్రలు, అద్దాలు, ఆపరేషన్లు చేసుకోవాలని సూచించారు. కంటి చూపు సంబంధిత వ్యాధులతో ఏ ఒక్కరు కూడా బాధపడవద్దని, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గా పథకాలలో కంటి వెలుగు పథకం ఒకటని, కంటి వెలుగు పథకం భారత దేశం మొత్తం కొనియాడిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి దశ దిశ చూపిస్తున్నాయని, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ నేతృత్వంలో పెద్దపెల్లి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.