కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి
హుజూర్ నగర్ జనవరి 31(జనం సాక్షి): కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు.మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని 21వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని, వార్డ్ కౌన్సిలర్ వీర్లపాటిగాయత్రి భాస్కర్ తో, గెల్లి అర్చనరవి ప్రారంభించి మాట్లాడుతూ అందత్వ నిర్మూలన కోసమే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్, గంగరాజు, రామ్ గోపి, గురవయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.