కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉత్సవాలు
కరీంనగర్,ఆగస్ట్31 ( జనంసాక్షి): గణెళిశ్ నవరాత్రులు భారీ బందోబస్తు నడుమ నిర్వహించాలని కరీంననగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నవరాత్రులను ముందుచూపుతో, అన్ని జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించారు. పండగ ముగిసేంత వరకు ఒక ప్రత్యేక కంట్రోల్ గదిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. అల్లర్లకు దారితీసే ఎలాంటి మెసేజ్లను పోస్టుచేసినా, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డవారిని గుర్తించి న్యాయస్థానం సమక్షంలో బైండోవర్ చేయాలన్నారు.