కప్పల రామచంద్రయ్యపై అసత్య ఆరోపణలు సరికాదు

జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ, జనం సాక్షి
మండలంలోని నందీపాడు శివారులో సర్వే నంబర్ 231లో కప్పల రామచంద్రయ్య కు చెందిన భూమి లేకున్నా అధికారులు వ్యవసాయ భూమిగా మార్చారని కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గత 40 సంవత్సరాలుగా ఉన్న భూమి ఇప్పుడు లేకుండా పోతుందా అని ఆయన వారిని ప్రశ్నించారు.అధికారులను,కోర్టులను కూడా మీరు తప్పుపడతారా అని జాజుల ప్రశ్నించారు.ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.