కబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన ఎమ్మెల్యే

మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): గో సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌… తాజాగా కబేలాకు అక్రమంగా తరలిస్తున్న వందగోవులను రక్షించారు. విశ్వసనీయ సమాచారంతో గోవుల వ్యానును వెంబడించిన ఎమ్మెల్యే.. సోమవారం ఉదయం షావిూర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాన్ని అడ్డుకున్నారు. స్వయంగా వ్యానుపైకి ఎక్కి ఆవులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆవులను చంపడం హిందువుల ధర్మం కాదని.. వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వాటిని విడిపించారని సమాచారం. అలాగే ఈ విషయంలో కేసు నమోదు కావాల్సి ఉందని తెలుస్తోంది.