కరెంట్‌ ఆదా చేసే వారికి అవార్డులు

హైదరాబాద్‌,నవంబర్‌8 (జనంసాక్షి) : కరెంట్‌ ఆదా చేసే వారికి అవార్డులు ఇస్తామని టీఎస్‌ రెడ్కో  వైస్‌ చైర్మన్‌, ఎండీ జానయ్య  చెప్పారు.  ప్రతి యేడు డిసెంబర్‌ నెలలో విద్యుత్‌ పొదుపు వారోత్సవాలు జరుపుతామని.. ఆ సమయంలో కరెంట్‌ ను ఆదా  చేసే వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహంతో పాటు అవార్డును అందచేస్తమన్నరు. కరెంట్‌ ను ఆదా  చేసే వారు ఈ నెల 29 లోపు దరఖాస్తు చేసుకోవాలని జానయ్య సూచించారు.  గ్రామాల నుంచి పట్టణాల వరకు కరెంట్‌ ను అదా చేసే వారికి అవార్డులను అందచేస్తమన్నారు.