కల్కి చెరువులో చేపలు వదిలిన పోచారం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): బాన్సువాడ పట్టణానికి సవిూపంలోని కల్కి చెరువులో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ చేప పిల్లలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.