కల్తీ కల్లు దందాపై అధికారుల చర్యలేవి?

ఆదిలాబాద్‌,  జిల్లాలోని నిర్మల్‌, బాసర ప్రాంతాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య 65 మందికి చేరింది. అస్వస్థతతో బాధితులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కల్తీ కల్లు దందాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిర్మల్‌లో కల్తీకల్లు దందాను టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత నిర్వహిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ నేత ఒత్తిడితోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.