కశ్మీర్‌ కోసం యుద్దానికి సిద్ధం

– ఎట్టిపరిస్థితుల్లోనూ కశ్మీర్‌ వదిలే ప్రసక్తే లేదు
– లోయలో బలవంతంగా హిందుత్వ అమలుకు బీజేపీ యత్నిస్తుంది
– కశ్మీర్‌ ప్రజలకు మేం చెప్పేది ఒకటే..
– మేం విూకు తోడుగా ఉన్నాం.. విూకు భరోసా ఇస్తున్నాం..
– పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా
ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  కశ్మీర్‌ కోసం తాము యుద్ధానికి సిద్ధమని, తమ సైనికులు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడేందుకు, ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా అన్నారు. ఈ మేరకు శుక్రవారం పాక్‌ విూడియాతో మాట్లాడారు. కశ్మీర్‌ పాక్‌ ముఖ్య ఎజెండా అని అన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం సవాలుగా భావిస్తున్నామని, కశ్మీర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు. మా ప్రతి సైనికుడు తన చివరి రక్తపు బొట్టు, చివరి బులెట్‌, చివరి శ్వాస ఆగే వరకూ కశ్మీర్‌ కోసం పోరాడుతూనే ఉంటాడని, కశ్మీర్‌ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే అన్నారు. ఈ రోజు కశ్మీర్‌లో హింస, విధ్వంసం పెరిగిపోతున్నాయని, మోదీ ప్రభుత్వం లోయలో బలవంతంగా హిందుత్వాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కశ్మీర్‌ ప్రజలకు మేం చెప్పేది ఒకటే.. మేం విూకు తోడుగా ఉన్నామన్నారు. విూకు భరోసా ఇస్తున్నాం.. కశ్మీర్‌ కోసం యుద్దానికి కూడా సిద్ధంగానే ఉన్నామని పాక్‌ ఆర్మీచీఫ్‌ అన్నారు. జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి నుంచి పాకిస్తాన్‌ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌ సగటున రోజుకు 10 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు దిగిందని వెల్లడైంది. పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలతో ఇరు పక్షాల మధ్య కాల్పుల ఘటనలకు దారితీసి ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో పాటు సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ప్రేరేపిస్తోంది. అయితే పాక్‌ ఆగడాలను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి. మరోవైపు గుజరాత్‌ తీరంలోకి సముద్ర మార్గం ద్వారా పాక్‌ కమాండోలు, ఉగ్రవాదులు ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాల సమాచారంతో పలు రాష్టాల్ల్రో భద్రతను కట్టుదిట్టం చేశారు.