కాంగ్రెస్‌కు కష్టకాలం దాపురించింది: మదన్‌

మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌కు ఓట్లే స్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీ తీస్తూ ప్రధాన వీధులగుండా మదన్‌రెడ్డి ప్రచారం చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మదన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మదన్‌రెడ్డి సమక్షంలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజల ఉత్సాహం చూ/-తుంటే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష¬దా కూడా దక్కడం కష్టమేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో ఓటమి భయం పట్టుకుందని పార్టీలో ఎవరన్నా మిగులుతార అనుమానం ప్రజలకు కలుగుతుందని అన్నారు. 2009లో మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేసింది 2014లో మేనిఫెస్టోలో పెట్టినవేకాకుండ పెట్టనివాటిని కూడా అనేక కార్యక్రమాలను తెచ్చి అమలు చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని అన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గం ఇంకా అభివృద్ది జరగాలంటే మరోమారు తనను ఎన్నుకోవాలని మదన్‌రెడ్డి కోరారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఎంతో అద్బుతంగా ఉందని అన్నారు. సునీతారెడ్డి నర్సాపూర్‌కు చేసిన అభివృద్ధి ఎంటో చెప్పాలని ప్రశ్నించారు.