కాంగ్రెస్ ఆదినుంచీ బిసి వ్యతిరేకే
పొన్నాలకు టిక్కెట్ విషయంలోనే తేలింది: ఎంపి బూర
హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): కాంగ్రెస్లో నెహ్రూ నుంచి రాహుల్గాంధీ వరకు వాళ్ల డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. ఒక్క టీఆర్ఎస్ పార్టీనే బీసీలకు రక్షణగా ఉంటుందన్నారు. తెలంగాణభవన్లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విూడియాతో మాట్లాడుతూ..వంచించి మోసం చేయడం కాంగ్రెస్ నైజమని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్యను గోసపెట్టి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చిన విషయాన్ఇన ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ తీరు కోదండరాం టికెట్ విషయంలో రుజువైందన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో తెలంగాణకు నష్టం చేయడానికి చంద్రబాబు వస్తున్నరు. కోదండరాంకు కేసీఆర్ను గద్దె దించాలన్న ఆరాటమే కనిపిస్తుంది తప్ప అక్రమ పొత్తులతో తెలంగాణకు జరిగే నష్టం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కూటమి గెలిస్తే అంతా గందరగోళమే. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే వేగంగా అభివృద్ధి జరుగుతదని ఎంపీ బూర స్పష్టం చేశారు. ప్రజలు నిజాలు గ్రహించాలని అన్నారు.