కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధిగా నాగుల విష్ణుకుమార్‌

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): గత దశాబ్ద కాలంపైగా కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తూ, పార్టీకి సేవలందిస్తున్న నాగుల విష్ణుకుమార్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కటకం మృత్యుంజయం పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం విష్ణుకుమార్‌కు నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, భారతావని విముక్తి కోసం పాటుపడిన కాంగ్రెస్‌ పార్టీ అంటే తనకెంతో ఇష్టమని విద్యార్థి దశ నుండే పార్టీ నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానన్నారు. కాగా తనపై నమ్మకముంచి జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్‌ రథ సారధి రాహుల్‌ గాంధీ, రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలతో పాటు పార్టీ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ పేర్కొన్నారు.