కాంగ్రెస్‌ నేతల విమర్శలు అర్థరహితం: వినయ్‌

వరంగల్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ అనవసర విమర్శలకు దిగుతోందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. అనవసర విమర్శలు చే/-తోన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలపై మండిపడ్డారు.  కాంగ్రెస్‌కు రాజకీయంగా బతుకునిచ్చిందే టీఆర్‌ఎస్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ లేకపోతే కాంగ్రెస్‌ పదేండ్లు అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మరచిపోయి ప్రజాప్రభుత్వమైన టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న రాష్టాన్న్రి అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ అలుపెరుగకుండా శ్రమిస్తుంటే, కాంగ్రెస్‌
కుట్రపూరితంగా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నదన్నారు.  తెలంగాణ విశాల ప్రజాహితాన్ని కోరేవారెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడరన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నేతలు మాటమార్చి మాట్లాడడం మైనార్టీలను మోసం చేయడమేనన్నారు.    సిఎం కెసిఆర్‌ ఉద్యమసారథిగా స్వరాష్టాన్న్రి సాధించారని, ప్రస్తుతం బంగారు తెలంగాణ సారథిగా ముందుకెళ్తున్నారన్నారు. తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకొని బతుకాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ నేతలు విమర్శలు మాని తెలంగాణ అభివృద్దికి కలసి రావాలన్నారు.