కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిక

నల్లగొండ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. నల్లగొండలో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. మూడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌గా పనిచేసిన చిలుకల గోవర్దన్‌ అదేవిధంగా పార్టీ సీనియర్‌ నేత, న్యాయవాది ధరనికోట రాము ఇరువురు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మంతనాలతో ఈ ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వీరిరువురి చేరికతో తన గెలుపు సునాయసం అయిందని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కంచెర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.