కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీకొట్టింది

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ
నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) :  కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం పెంచుతామన్న పెన్షన్లకు కేసీఆర్‌ ఇంకా 16రూపాయలు ఎక్కువ పెంచారన్నారు. మేం ఆరు నెలల కిందటే మ్యానిఫెస్టో ప్రకటిస్తే.. దానిని అమలు చేయడానికి ఆరు రాష్ట్రాల బడ్జెట్‌ అవసరం అవుతుందని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారని షబ్బీర్‌అలీ గుర్తుచేశారు. మరి ఇప్పుడు మాకు సాధ్యం కాకపోతే విూకెలా సాధ్యం అవుతుందని  ఆయన ప్రశ్నించారు. అబద్ధపు హావిూలతో టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
గత రుణమాఫీ నాలుగు విడతలుగా అమలు చేశారని, ఇప్పుడేమో మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్‌ మాటలను, హావిూలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ కూటమి టికెట్లు పంపకాల అంశం కొలిక్కి వస్తుందన్నారు.