కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నికలలో పాల్గొన్న కేతావత్ భీల్యా నాయక్

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలో హోమంతాలపల్లిలొ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నికల్లో పాల్గొన్న టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ హోమంతాల పల్లి గ్రామ శాఖ నూతన కమిటీని ప్రకటించారు హోమంతాలపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గా వంగాల రమేష్ ప్రదాన కార్యదర్శి గా ముదిగొండ శేఖర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గా నల్ల ముత్తయ్య గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషకరం అని అన్నారు.రానున్న రోజుల్లో అందరం కలసి కట్టుగా పనిచేసి దేవరకొండ ఖిల్లా పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు రానున్నది కాంగ్రెస్ పార్టీ అదికారం అని ప్రజా సంక్షేమ పాలన అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవరకొండ నియోజకవర్గం లొ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అన్నారు దేవరకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు కేతావత్ భీల్యా నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం, ఎంపీపీ భవాని పవన్ కుమార్,మాజి అధ్యక్షులు గొవన్నా, మాజి ఎంపీపీ రవి నాయక్, మల్లేష్, మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు