కాంగ్రెస్ బలోపేతానికి సహకరించండి.

 

 

 

 

 

 

 

 

– మాజీ మంత్రి గడ్డం వినోద్.బెల్లంపల్లి, జనవరి 31, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని మాజీ మంత్రి గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని ప్రముఖ న్యాయవాది చిప్ప మనోహర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని, అలాగే పార్టీలోకి రావాలని సాదారంగా ఆహ్వానించారు. దీనికి చిప్ప మనోహర్ సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట న్యాయవాది సాయి కుమార్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.