కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. భద్రకాళి కాటన్ మిల్లులో అర్థరాత్రిపూట షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 500 పత్తిబేళ్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఆస్తినష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు.