కాత్యాయినిగా దర్శనమిచ్చిన సరస్వతీ దేవి

నిర్మల్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం అర్థరాత్రి నుంచే భక్తులు ఆలయంలో వేచి ఉన్నారు. క్యూలైన్‌లో వేచి ఉన్న చిన్నారులకు ఆలయ అధికారులు బిస్కెట్లు పంపిణీ
చేస్తున్నారు. వేకువజామున విశిష్ట పూజ అనంతరం అక్షరాభ్యసాలు ప్రారంభమయ్యాయి. గోదావరితీరంలో భక్తుల సందడి కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అలాగే అక్షరాభ్యాసాల కోసం కూడా చిన్నారులతో తల్లిదండ్రులు తరలి చ్చారు.