కారును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్‌ దాబా ఎదుట అదుపు తప్పిన ఆయిల్‌ ట్యాంకర్‌ మారుతి ఓవ్నిూ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించి విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.