కారు ఢీకొని 20 గొర్రెలు మృతి

మహబూబాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి) : మహబూబాబాద్‌ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా వేగంగా కారు నడపడంతో వాటిపైకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గొర్రెల యజమాని తీవ్ర దిగ్భార్రతికి గురయ్యాడు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే గొర్రెలు చనిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 గొర్రెల మృతితో తీవ్ర నష్టం వాటిల్లిందని బోరున విలపించాడు. కారు యజమానిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.