కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన తల్లి కొడుకులు కృష్ణవేణి, మహేష్ మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.