కార్గిల్‌ అమర వీరులకు ఘన నివాళి

kargil-1కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర్‌ జవాన్‌ జ్యోతి దగ్గర పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కార్గిల్ యుద్ధంలో మ‌ర‌ణించిన సైనికుల‌కు ఈ సంద‌ర్భంగా నివాళ్లు అర్పించారు. కేంద్ర మంత్రి తో పాటు త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు సెల్యూట్ చేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ద్రాస్ సెక్టార్‌లో కూడా కార్గిల్ అమ‌రవీరుల కుటుంబ స‌భ్యులు కూడా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఆఫీస‌ర్లు   పాల్గొన్నారు.

చివ‌రి శ్వాస ఉన్నంత వ‌ర‌కు మాతృదేశం కోసం పోరాడిన ప్ర‌తి వీర సైనికుడికి వంద‌నాలు అర్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు. సైనికుల విరోచిత ప్రాణ త్యాగాలు ప్రేర‌ణ క‌లిగిస్తున్నాయ‌న్నారు మోడీ