కార్డెన్‌ సర్చ్‌లో మద్యం స్వాధీనం

నాగర్‌కర్నూల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అమ్రాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయం వీధిలో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో 105 మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలు, ఆటో, ఫోర్‌ వీలర్‌, రూ.45 వేల విలువగల మద్యం బాటిల్స్‌, 80 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రత చర్యల్లో భాగంగా నిర్బంధ తనిఖీలు చేపట్టామని డీఎస్పీ నర్సింహులు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకారించాలని, గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అమ్రాబాద్‌ సీఐ, అచ్చంపేట, లింగాల, పదర, ఈగలపెంట, అమ్రాబాద్‌, బల్మూర్‌, సిద్ధాపూర్‌ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.