కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి

సిద్దిపేట,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): భవన, ఇతర నిర్మాణ కార్మికులు కార్మికశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సంక్షేమశాఖ అధికారి తెలిపారు. సంక్షేమ చట్టం కింద కార్మికుల పేర్ల నమోదు, నవీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఇందుకు జిల్లాలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కార్మికులు పేర్లు నమోదు చేయించుకొని సంక్షేమ బోర్డు పథకాలకు అర్హులుగా మారాలన్నారు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.